కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కమ్యునిటీ ట్రాన్స్మిషన్ విషయం లో ప్రభుత్వం ఇప్పటివరకూ సరైన సమాచారం ఇవ్వడం లేదు అనే ఆరోపణల నేపధ్యం లో వస్తున్న కేసుల నెంబర్ చూసిన ఎవ్వరైనా కమ్యునిటీ స్ప్రెడ్ జరుగుతోంది అని తేలికగా చెప్పగలరు.
నిపుణులు , ప్రజా సంఘాలు కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ విషయం లో జాగ్రత్తలు చెబుతున్న ఈ తరుణం లో ప్రజలు అప్రమత్తంగా ఉండడం ఎప్పటికి నేర్చుకుంటారో తెలియని పరిస్థితి. అమెరికా , బ్రెజిల్ , ఇటలీ లకి పోటీ గా ఇండియా లో కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉంది అని ప్రభుత్వాలు చెబుతున్నా 230 మరణాలు కేవలం గడిచిన 24 గంటల్లో నమోదు అవ్వడం కలవర పెడుతోంది.
గడిచిన 24 గంటల్లో మన దేశం లో 8392 కేసులు నమోదు అయ్యాయి .. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షల కి చేరువగా ఉంది. లక్షా తొంభై రెండు వేల పైగా కేసులు ఉండడం తో రేపటికి రెండు లక్షలు దాటచ్చు అంటున్నారు.