న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య గల నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటలకు ఈ దాడులు చేసింది. ఉగ్ర శిబిరాలపై భారత భద్రతా దళాలు దాడులు చేసిన విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
12 మిరాజ్ 2000 భారత యుద్ధ విమానాలు ఎల్ఓసీ వెంట ఉన్న ఉగ్రస్థావరరాలపై దాడులకు దిగాయి. ఉగ్రవాద క్యాంపులపై 1000కిలోల బాంబులను వేసినట్లు ఐఏఎఫ్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ దాడితో ఉగ్రవాద స్థావరాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. బాలకోట్, ఛకోటి, ముజఫరాబాద్ ప్రాంతాల్లోని జైషే ఉగ్రవాద స్థావరాలను 100శాతం నాశనం చేసినట్లు భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
భారత ఆర్మీ దాడుల విషయంపై ‘వావ్’ అంటూ జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ దాడి చిన్నదేం కాదు, ఇది నిజమైతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వేచిచూస్తున్నానని అన్నారు. యుద్ధ విమానాలు నడిపిన పైలెట్లకు సెల్యూట్ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
Wow, if this is true this was not a small strike by any stretch of imagination but will wait for official word, should any be forthcoming. https://t.co/bOFt7SXl43
— Omar Abdullah (@OmarAbdullah) February 26, 2019
భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి బాలకోట్ వరకు చొచ్చుకొచ్చాయని ఇంతకుముందే పాకిస్థాన్ ఆరోపించింది. బహిరంగ ప్రదేశాల్లో పలుచోట్ల బాంబులు వేశాయని పేర్కొంది. పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలోని ఓ పట్టణమే బాలకోట్. ఇది ఎల్ఓసీకి 50కి.మీ దూరంలో ఉంటుంది. ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన తాజా దాడులతో ఇరు దేశాల మధ్య ఉగ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
?? I salute the pilots of the IAF. ??
— Rahul Gandhi (@RahulGandhi) February 26, 2019
Payload of hastily escaping Indian aircrafts fell in open. pic.twitter.com/8drYtNGMsm
— DG ISPR (@OfficialDGISPR) February 26, 2019
2016లో యురి ఘటన తర్వాత పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి చొచ్చుకెళ్లిన భారత భద్రతా దళాలు ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సర్జికల్ స్ట్రైక్స్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు పుల్వామా దాడి నేపథ్యంలో మరోసారి భారత్ నియంత్రణ రేఖను దాడి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. ఫిబ్రవరి 14న జైషే ఉగ్రవాదుల జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
తాజా పరిస్థితిపై కేబినెట్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ తాజా పరిస్థితుల నేపథ్యంలో కీలక మంత్రులతో సమావేశమయ్యారు. విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాజా దాడుల నేపథ్యంలో భారత సరిహద్దు వెంబడి భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.