డ్రాగన్ కంట్రీ చైనాకు భారత దేశ కేంద్ర ప్రభుత్వం మరొక ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే వారికి సంబంధించిన యాప్స్ ను బహిష్కరించిన భారత్, హైవే కాంట్రాక్ట్ నుంచి ఉద్వాసన ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 13,277 కోట్ల రూపాయల విలువ చేసే తాల్చేరు ఎరువులు మరియు బొగ్గు గ్యాస్సిఫికేషన్ పరిశ్రమ నిర్మాణ కాంట్రాక్ట్ నుండి చైనాకు ఉద్వాసన కల్పించింది.
గత ఏడాది సెప్టెంబర్లో చేసుకున్న ఈ కాంట్రాక్టును వుహాన్ ఇంజనీరింగ్ సంస్థ సొంతం చేసుకోగా సాంకేతిక కారణాలను లోపాలుగా చూపి కేంద్ర ప్రభుత్వం వారిని ఈ కాంట్రాక్ట్ నుండి తప్పించింది.
దీని వల్ల చైనాకు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇక ఈ కాంట్రాక్టును మరో భారతదేశ ఇండస్ట్రీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.