అంతర్జాతీయంగా ఇండియా దేశం ఖ్యాతి ఇటీవల పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ వేదికలపై దేశానికి చెందిన నాయకులకు పిలుపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో టెక్నాలజీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా 5g గురించి రకరకాల వార్తలు ఎప్పటినుండో వస్తున్నాయి. అలాంటి సమయంలో కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంటర్ అవ్వకముందు ఆ మధ్య చైనా కి సంబంధించిన కంపెనీ 5g సేవలు ఇవ్వటానికి ముందుకు రావడం జరిగింది.
దీంతో ప్రపంచంలో ఉండే అగ్రదేశాలు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ అయ్యాయి. కానీ ఎప్పుడైతే చైనా నుండే కరోనా వైరస్ ప్రపంచం లోకి ఎంటర్ కావటం జరిగిందో.. దెబ్బకి ప్రపంచ దేశాలు మొత్తం వెనక్కి తగ్గాయి. దీంతో చైనా కి సంబంధించిన 5g సేవలు మాకొద్దు అంటే చాలా దేశాలు వెనక్కి తగ్గాయి.
ఇలాంటి తరుణంలో అప్పట్లో రిలయన్స్ అంబానీ ఇండియాలో 5g సేవలు అంటూ ప్రకటన కూడా చేశారు. కానీ తర్వాత దాని గురించి పెద్దగా వార్తలు రాలేదు. పరిస్థితి ఇలా ఉండగా ఐటీ సెక్టార్లో 5g సేవలు అందించడానికి జపాన్ తో భారత్ తాజాగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. వినబడుతున్న వార్తల ప్రకారం సముద్రం అడుగు భాగం నుండి కూడా కేబుల్స్ వేసే రీతిలో జపాన్ సహకరించాలని భవిష్యత్తులో శాటిలైట్ సమస్యలు రాకుండా. అట్లాగే 5g సేవలో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో జపాన్.. భారత్ కి సహకారం అందించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.