సిడ్నీ(ఆస్ట్రేలియా): జనవరి 12: భారీ లక్ష్య సాధనలో భారత జట్టు ఆదిలోనే తడబడింది. సిడ్నీ వేదికగా ఇండియా-ఆసీస్ జట్ల మధ్య శనివారం జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో 289 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పొయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
శిఖర్ థావన్, అంబటి రాయుడు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. కెప్టెన్ కోహ్లీ మూడు పరుగులచేసి అవుటయ్యాడు.
ధోనీ, రోహిత్ శర్మలు క్రీజ్లో ఉన్నారు.
10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 21/3 .
ఆపీస్ బౌలర్లు రిచర్డ్ సన్ 2, బెహ్రాన్ డోర్ఫ్ 1 వికెట్ సాధించారు.
previous post
next post