మెల్ బోర్న్( ఆస్ట్రేలియా), జవనరి 18: భారత జట్టు ముందు ఆసీస్ 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శుక్రవారం మెల్బోర్న్ గ్రౌండ్స్లో జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య జట్టు 48.4 ఓవర్లలో 230 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. జట్టులో హ్యాండ్స్ కాంబ్ ఒక్కడే 58 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ సాధించారు. భారత స్పిన్నర్ ఛాహల్ 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. భువి రెండు, షమి రెండు వికెట్లు సాధించారు.
అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన టీం ఇండియా నిదానంగా ఆడుతోంది. కెప్టెన్ కోహ్లి, శిఖర్ థావన్లు క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం 13 ఓవర్లకు రోహిత్ శర్మ వికెట్ నష్టపోయి 47 పరుగులు సాధించింది.
previous post