మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా), జనవరి 18: ధనా ధన్ థోనీ మరో సారి బాధ్యతాయుతమైన ఆటతీరుతో భారత్కు వన్డే సీరీస్ను అందించాడు. శుక్రవారం మెల్బోర్న్ వేదికగా జరిగిన చివరి వన్డే మ్యాచ్లో టీం ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి వన్డే సీరీస్ను కైవసం చేసుకుంది. ధోనీకి అండగా కేదార్ జాదవ్ నిలిచి జట్టుకు విజయం చేకూర్చాడు.
భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను ఆఖరి నాలుగు బంతులు ఉండగానే విజయం సాధించింది.
231 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ తొమ్మిది పరుగులు, శిఖర్ థావన్ 23 పరుగులు చేశారు. కెప్టెన్ కోహ్లి 46 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం ధోనీ, జాదవ్లు ఆచీ తూచీ ఆడుతూ జట్టును విజయపధంలో నిలబెట్టారు. 114 బంతుల్లో ఆరు ఫోర్లతో ధోనీ 87పరుగుల సాధించగా, కేదార్ జాదవ్ 57 బంతుల్లో ఏడు ఫోర్లతో 61 పరుగులు చేశాడు.
భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఆతిధ్య ఆసీస్ జట్టు 48.4 ఓవర్లలో 230 పరుగులు సాధించి ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్ చాహల్ ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్ బౌలర్లు పీటర్, స్టోయిన్స్ , రిచర్డ్ సన్లు ఒకొక్క వికెట్ వంతున పడగొట్టారు.
ఈ మూడు వన్డేల సీరీస్లో ఆసీస్ తొలి వన్డేలో విజయం సాధించగా, మిగిలిన రెండు వన్డేల్లో భారత్ గెలిచింది.
previous post
next post