ఈ ఏడాది జరగాల్సిన టి20 వరల్డ్ కప్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఆస్ట్రేలియా ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ ను నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2021లో జరగాల్సిన టి20 వరల్డ్ కప్ ను ఇండియా హోస్ట్ చేయనుంది.
ఈ మేరకు ఇండియా, ఆస్ట్రేలియా పరస్పర అంగీకారంతో నిర్ణయించబడింది. అసలు 2020 టి20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు ఆ టోర్నమెంట్ వాయిదా పడడంతో 2021లో ఇండియా నిర్వహించాల్సిన టోర్నమెంట్ కు ఏమైనా మార్పులుంటాయా అని అనుకున్నారు. అయితే ఇండియా, ఆస్ట్రేలియా కలిసి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు 2021 టి20 వరల్డ్ కప్ ను ఇండియా హోస్ట్, 2022 టి20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా నిర్వహించనుంది. 2016లో వరల్డ్ కప్ నెగ్గిన వెస్టిండీస్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా 2021లో బరిలోకి దిగుతుంది.