India : ఏ అవకాశం చిక్కినా భారత్లో ఏదో ఒక అలజడి సృష్టించడానికి పాకిస్థాన్ సిద్ధంగానే ఉంటుంది.ఏదో విధంగా భారత్లో అస్థిరతను సృష్టించటమే పాకిస్తాన్ ధ్యేయంగా కనిపిస్తోంది.
భారతదేశం ఎంత స్నేహహస్తం అందించినా పాకిస్తాన్ పైకి మంచిగా ఉంటూ లోలోపల గోతులు తీస్తూనే ఉంది .తాజాగా పాకిస్తాన్ చేసిన ఇలాంటి కుట్ర ఒకటి రిపబ్లిక్ డే నాడు బయటపడింది.కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడికి పాక్లో కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం 300 ట్విటర్ ఖాతాలు సృష్టించారని నిఘా సంస్థలు గుర్తించాయి. దీంతో రైతుల ర్యాలీకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఢిల్లీ పోలీసులు. రాజ్పథ్ పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.
India : కుట్రకు తెర తీసిన పాక్ !అప్రమత్తమైన భారత్!
ట్రాక్టర్ల ర్యాలీకి మొత్తం 37 షరతులతో అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 5.00 వరకు ర్యాలీకి అనుమతి ఇచ్చారు. 5వేల ట్రాక్టర్లు, 5వేల మంది రైతులకే పర్మిషన్ ఇచ్చారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాల కోసం ఒక లైన్ వదిలేయాలని, అభ్యంతరకర పోస్టర్లు, బ్యానర్లు పట్టుకోరాదని తెలిపారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగి ఉండరాదని, అనుమతించిన రూట్లో మాత్రమే ర్యాలీ నిర్వహించాలని, ధర్నాలు, రోడ్లపై బైఠాయించకూడదని షరతులు విధించారు. మార్గమధ్యంలో కొత్త ట్రాక్టర్లను చేర్చుకోరాదని తెలిపారు.రైతుల ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు ఈ నెల 13 నుంచి 18 మధ్య పాకిస్థాన్లో 300 ట్విటర్ ఖాతాలు సృష్టించినట్లు గుర్తించారు పోలీసులు.
ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సవాలుతో కూడినప్పటికీ కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరుగుతుందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.మరోవైపు.. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సింగు సరిహద్దుల నుంచి ప్రారంభమైంది. ట్రాక్టర్లపై త్రివర్ణ పతాకాలను రెపరెపలాడిస్తూ చిల్లా సరిహద్దుల మీదుగా ఢిల్లీ -నోయిడా లింకు రోడ్డులోకి ప్రవేశిస్తున్నారు రైతులు. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, కార్లలతో.. ఢిల్లీ వెైపుగా వెళ్తున్నారు రైతులు.రైతుల ర్యాలీని విచ్ఛిన్నం చేయడం ద్వారా వారిని భారత ప్రభుత్వంపై ఉసిగొల్పేందుకు పాకిస్తాన్ పన్నాగం పన్నినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత్ అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తక్షణ చర్యలు చేపట్టాయి.