ఇప్పటికే కరోనా సెకండ్ వెవ్ తో ఇటు ఐరోపా దేశాలు అమెరికా గడగడ లాడుతూ ఉన్నాయి. రోజుకో లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం భారత్కు ఎలాంటి భయం లేకుండా అది త్వరలోనే రెండో మేము భారత్ ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసు లో తగ్గుదల నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లోనూ కేసులు గణనీయంగా తగ్గాయి. అయితే ప్రస్తుతం జనాల్లో కరోనా వల్ల భయం పోవడంతో పాటు నిర్లక్ష్యం ఎక్కువవడం రెండో వెవ్ అవకాశాలను కొట్టిపారేయలేమని భారత దేశ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో సుమారు పది కోట్ల మందికి పైగా కరోనా వచ్చి వెళ్లిన వారికి తెలియని పరిస్థితి ఉందని, సెకండ్ వి లో వైరస్ మరింత విజృంభించి కొత్తగా వచ్చే అవకాశాలు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రుల సమావేశంలోనూ ప్రధాని మోడీ సెకండ్ వేవ్ అంశాన్ని ప్రస్తావించారు. ఏమాత్రం అజాగ్రత్తగా వద్దని, ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి విషమంగా ఉందని రోజుకు అక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు.
వచ్చేనెల 31 వరకు అంతర్జాతీయ విమానాలను రద్దు
ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణ భారత్లోనూ కరోనా ఉద్ధృతి ప్రత్యేక రూట్లలో మాత్రమే విమానాలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. భారత్లోనూ కరోనా ఉద్ధృతి పై భయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.అయితే, కొన్ని ప్రత్యేక రూట్లలో డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో విమానాలు మాత్రం నడుస్తాయని తెలిపింది. కరోనా పరిస్థితులకు అనుగుణంగా విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. కరోనా వేళ ప్రయాణాలకు సంబంధించిన ప్రయాణ, వీసా పరిమితుల పేరుతో కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్లో మార్పులు చేస్తున్నామని పేర్కొంది.