Covid vaccination: ప్రస్తుతం కోవిడ్ విజృంభన మామూలుగా లేదు. రెండవ వేవ్ ప్రభావం కొద్దిగా తగ్గినప్పటికీ రాష్ట్రంలో మూడవ వేవ్ మొదలవుతున్న సంకేతాలు వస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా ఈ కరోనా బారిన పడడం మొదలైంది. కొత్త వేరియంట్ల దాడి నుండి తప్పించుకోవాలంటే పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ సాధించడం ఒకటే మార్గం.
ఇదే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారతదేశంలో గుర్తించిన డెల్టా వేరియంట్ వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తం చేసింది. ఈ కొత్తరకం వైరస్ కు శక్తి ఎక్కువ అని తేల్చి చెప్పింది. ఇలాంటి సమయంలోనే బ్రిటన్ కూడా వ్యాక్సినేషన్ విషయమై నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల మధ్య అంతరాన్ని తగ్గించింది. అయితే భారతదేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
రెండో డోసు వ్యాక్సిన్ ను వీలైనంత ఆలస్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కోవిడ్ నుండి కోలుకున్న వారు మూడు నెలల పాటు వాక్సినేషన్ వేయించుకోవడానికి లేదు. అలాగే రెండు డోసుల మధ్య అంతరాన్ని కూడా 16 వారాలకు పెంచారు. మరొకవైపు బ్రిటన్లో రెండు డోసుల మధ్య గ్యాప్ ని 12 వారాల నుండి ఎనిమిది వారాలకు తగ్గించడం గమనార్హం.
కాబట్టి మన దేశంలో కూడా రెండు డోసుల మధ్య అంతరాన్ని తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. cdc, సిఎస్ఐఆర్ పరిశోధకులు కూడా కేంద్రానికి ఇదే విషయాన్ని సూచించారు. డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదు నేపథ్యంలో వారు బ్రిటన్ వారు డోసుల అంతరాన్ని తగ్గిస్తే భారతదేశంలో మాత్రం వ్యాక్సిన్ల కొరత కప్పిపుచ్చడానికి రెండు రోజుల మధ్య అంతరాన్ని పెంచుతున్నారు.
మొదటి డోసు వల్ల శరీరంలో ఒక రకంగా యాంటీబాడీలు ఉత్పన్నమవుతాయి. వాటితోనే ప్రజలను వైరస్ తో పోరాటం చేయడం ఎంతవరకు సమంజసమని…. ఇలా చేస్తే మరిన్ని ప్రాణాలను నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు.