భారత జట్టు యువ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాలో అద్భుతమైన ప్రదర్శనతో ఎంతోమంది ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అతను బౌలింగ్ చూసి మాజీ క్రికెటర్ లంతా మంత్రముగ్ధులు అయ్యారు. సీనియర్ బౌలర్ లు లేని సమయంలో ఆరంగేట్రం చేసిన సిరాజ్ చివరి టెస్టులో ఫేస్ దళానికి సారథ్యం వహించాల్సి వచ్చింది. అయితే అందరి అంచనాలను నిలబెడుతూ సిరాజ్ ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసుకుని భారత జట్టును విజయం ముంగిట నిలిపాడు. ఆతర్వాత బ్యాట్స్మెన్ ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారో అందరికీ తెలిసిందే.
ఇక ఇలా రెగ్యులర్ బౌలర్ గా తన పేరును ఖరారు చేసుకున్న సిరాజ్ ఈరోజే ఆస్ట్రేలియా నుండి భారత గడ్డపై కి వచ్చాడు. తన సొంత నగరమైన హైదరాబాద్ లో దిగగానే నేరుగా ఇంటికి కూడా వెళ్లకుండా సమాధి వద్దకు వెళ్ళాడు. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అతని తండ్రి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే అతను తను టెస్ట్ క్రికెట్ ఆడడం తన తండ్రి చిరకాల కల అని ఇంటికి కూడా వెళ్లకుండా గేమ్ కోసం ఆస్ట్రేలియాలోని ఉండిపోయాడు.
అనుకున్నట్టే మహమ్మద్ షమీ ముందు టెస్టుల్లో గాయం కావడంతో రెండో టెస్ట్ లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ప్రతి టెస్టులో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకొని ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్ గా నిలిచాడు. ఇక చిరస్మరణీయమైన టెస్ట్ సిరీస్ విజయం తర్వాత హైదరాబాద్ చేరుకుని నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించాడు మహమ్మద్ సిరాజ్.