కరోనా వైరస్కు గాను ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేసి వాటిని టెస్టు చేస్తున్నాయి కూడా. అనేక వ్యాక్సిన్లు ఇప్పటికే ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. అయితే ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేసి విడుదల చేస్తే ముందుగా మాకు వ్యాక్సిన్ డోసులను సప్లై చేయాలంటూ ఇప్పటికే అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఫార్మా కంపెనీలతో ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా ఇందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 5 ఫార్మా కంపెనీలతో వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం చేసుకునేందుకు గాను భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ను దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ను ఆ సంస్థ మన దేశంలో ఫేజ్ 2, 3 దశల్లో ట్రయల్స్ కూడా చేపట్టనుంది. ఈ క్రమంలో సీరమ్ ఇనిస్టిట్యూట్తోపాటు కరోనా వ్యాక్సిన్లను ఇప్పటికే తయారు చేసి టెస్ట్ చేస్తున్న భారత్ బయోటెక్, జైడస్ కాడిలా, మరోరెండు కంపెనీలు బయోలాజికల్ ఇ, జెన్నోవాలతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందుకుగాను కేంద్రం నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూఫ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ)కి చెందిన స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీకి బాధ్యతలను అప్పగించింది.
కాగా గురువారం వరకు ఆ 5 కంపెనీలు వ్యాక్సిన్ తయారీ విధానం, ధర, వ్యాక్సిన్ ఎప్పటి వరకు, ఎంత మేర ఉత్పత్తి చేసి అందిస్తారు అనే వివరాలను కేంద్రానికి తెలుపుతాయి. తరువాత కేంద్రం ఆలోచించి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఆయా కంపెనీలతో కేంద్రం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇక మరో రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ అతి త్వరలో వస్తుందని కీలక ప్రకటన చేశాక.. మూడు రోజులకే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయడం విశేషం. మరి ప్రజలకు కరోనా వ్యాక్సిన్ను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?