వాషింగ్డన్, ఫిబ్రవరి 3: అమెరికాలో విద్యార్థి వీసా దుర్వినియోగం కేసులో అరెస్టయిన విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందించనున్నట్లు అమెరికాలోని భారత రాయబారి హర్షవర్థన్ తెలిపారు.
వేరువేరు ప్రాంతాల్లో అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు అధికారులను పంపినట్లు హర్షవర్థన్ మీడియాకు తెలియజేశారు. సోమవారం నాటికి వారందరినీ కలిసి న్యాయసహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు.
అమెరికాలో వీసాల దుర్వినియోగం కేసులో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇండియాకు చెందిన 139మంది విద్యార్థులను అరెస్టు చేశారు.