ఇక్కడ భారతదేశంలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి పారిశ్రామిక దిగ్గజాలు వేల కోట్లు మోసం చేసి విదేశాలకు వెళ్ళి పోతూ ఉంటే మనం ఏమీ అనలేకున్నాం. భారత దేశ ప్రభుత్వాన్ని ఇటువంటి విషయాల్లో తిట్టుకొని వారు లేరు. అలాంటిది పరిస్థితి అమెరికాలో కూడా ఉంది. అయితే అక్కడ కూడా వారిని గడగడలాడించింది మన భారతీయుడే.
అమెరికాలో బ్యాంక్ నుండి పదిహేడు లక్షల డాలర్ల మేరకు మోసగించి భారతీయుడు సంచలనం సృష్టించాడు. న్యూజెర్సీకి చెందిన మార్బుల్ గ్రానైట్ వ్యాపారి రాజేంద్ర కంకారియా ఆర్థిక నేరానికి పాల్పడినట్లు కోర్టులో వెల్లడయింది. ప్రస్తుతం మూతపడిన లోటస్ ఎగ్జీమ్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆ సంస్థలో అతనికి వాటాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఒక అమెరికన్ బ్యాంకు నుండి అక్రమంగా రుణం పొందేందుకు మార్చి 2016 నుండి మార్చి 2018 మధ్య కాలంలో తన ఉద్యోగుల సహకారంతో పక్కా ప్రణాళికను అమలు చేసిన ఘనత రాజేంద్ర కే దక్కింది.
హామీగా ఇచ్చేందుకు తగినన్ని స్థిరాస్తులు లేని నేపథ్యంలో కంకారియా సంస్థ ఉద్యోగుల సహకారంతో ఆన్ లైన్ మోసానికి పాల్పడ్డారు. దీనిలో భాగంగా సంస్థ ఉద్యోగులు తమ వినియోగదారుల పేరు మీద ఫేక్ ఈ మెయిల్ ఖాతాలు క్రియేట్ చేశారు. సంస్థ గురించి బ్యాంకు ఆడిటర్లకు సంస్థలకు భారీ మొత్తంలో తాము బకాయిలు ఉన్నామని…. వాటిని త్వరలోనే చెల్లిస్తామని సమాచారం ఇచ్చారు.
అది నిజమనిభావించిన బ్యాంకు సంస్థకు రుణాలు మంజూరు చేసింది. ఈ లావాదేవీల్లో బ్యాంకుకు 17 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 125 కోట్ల 19 లక్షల 22వేల 500 రూపాయల నష్టం సంభవించిందని అమెరికా న్యాయస్థానంలో రుజువైంది. ఈ నేరానికి కోర్టు రాజేంద్ర కంకరియా కు గరిష్టంగా 30 సంవత్సరాలు జైలు శిక్ష తో పాటు ఒక మిలియన్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందట.