భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్ 3 – ఎం 3 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవతరించింది. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందన్నారు.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పెస్ సెంటర్ (షార్) నుంచి ఎల్వీఎం 3 వాహక నౌక నింగిలోకి దూసుకువెళలింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 24,30 గంటల పాటు కొనసాగింది. ఈ ఉదయం 9 గంటలకు వన్ వెబ్ కు చెందిన 36 ఉప గ్రహాలను ఎల్వీఎం – 3 వాహన నౌక తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు 5.8 టన్నులుగా శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉపగ్రహాలను ఎల్వీఎం – 3 సురక్షితంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్ వెబ్ తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా మొదటి 36 ఉప గ్రహాలను గత ఏడాది అక్టోబర్ 23న ఇస్రో విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను పంపింది.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం సక్సెస్ అయ్యిందన్నారు. ఇది ఇస్ర్రో సిబ్బంది సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. దీనికి సంబంధించి పని జరుగుతోందన్నారు. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తామని చెప్పారు. జీఎస్ఎల్ వీ మార్క్ 3 రాకెట్ ను మరింత అభివృద్ధి చస్తామని ఆయన వెల్లడించారు.
Breaking: మంత్రి ఆదిమూలపు సురేష్ కు తప్పిన ప్రమాదం