WTC Final: ఈనెల 18వ తేదీన న్యూజిలాండ్ తో సౌతాంప్టన్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. మూడు రోజులు జరిగిమ ఈ మ్యాచ్ లో జట్టు రెండు టీంలు గా విడిపోయి ప్రాక్టీస్ చేశారు
.
అయితే జట్టులోని కొత్త ఆటగాళ్లు, పెద్దగా అనుభవం లేని వారు సత్తా చాటాలని యాజమాన్యం భావించగా అందుకు భిన్నంగా టెస్టుల్లో నిలదొక్కుకున్న సీనియర్ ప్లేయర్లే బాగా రాణించారు. బీసీసీఐ విడుదల చేసిన స్కోర్ బోర్డు ప్రకారం జడేజా 75 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ గా నిలిచాడు.
భారతదేశానికి ఈ మధ్య కాలంలో రవీంద్ర జడేజా కీలక ఆల్ రౌండర్ గా మారాడు. మ్యాచ్ విన్నింగ్ సామర్ధ్యం ఉన్న అతను ఎటువంటి తడబాటు లేకుండా ఆడినట్లు తెలిపారు. అలాగే కచ్చితంగా తుది చోటు సంపాదిస్తాడు అనుకుంటున్న మహమ్మద్ సిరాజ్ కూడా మూడవ రోజున 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
మొదటి రెండు రోజుల్లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మూడు వికెట్లు తీసుకోగా, చిచ్చరపిడుగు వికెట్ కీపర్ రిషబ్ పంత్ 94 బంతుల్లో 121 పరుగులు చేయగ మరొక యువ ఆటగాడు శుభమన్ గిల్ 135 బంతుల్లో 85 పరుగులు చేశాడు.
మొత్తానికి పైన చెప్పిన అయిదుగురు కూడా జట్టులో కచ్చితంగా చోటు సంపాదించాల్సిన వారే. అయితే ఇషాంత్, సిరాజ్ మధ్య పోటీ ఉంది. అలాగే భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలి అనుకుంటే జడేజా స్థానానికి కూడా ముప్పు ఉండవచ్చు.
ఇక ఇప్పుడు వీరు ముగ్గురూ ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించడంతో వీరిలో ఏ ఇద్దరిని తుది జట్టులో కి తీసుకోవాలని అని యాజమాన్యం మదనపడూతోంది. మొత్తానికి భారత్ లోని యువ, సీనియర్ ఆటగాళ్లకు ఈ మూడు రోజులు మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ లభించింది అనే చెప్పాలి.