యూకేలో అత్యంత ధనవంతురాలు ఎవరంటే.. ముందుగా గుర్తుకువచ్చేది ఇంగ్లాండ్ యువరాణి క్వీన్ ఎలిజబెత్.. కానీ ఆ దేశంలో ఆమె కంటే ఎక్కువ ధనవంతురాలు మన భారతీయ మహిళ అని గార్డియన్ పత్రిక ప్రచురించింది..! బ్రిటిష్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్, రిషి సునక్ భార్య అక్షతా మూర్తి ఆర్ధిక హోల్డింగ్స్ను వెల్లడించడంలో విఫలం అయ్యారనే ఆరోపణలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు…? పూర్తి వివరాలు ఇలా..
యుకె చట్టం ప్రకారం మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారి ఆర్ధిక వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. దీనివలన మంత్రులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు ఎటువంటి సంఘర్షణలు తలెత్తకుండా ఉంటాయి. ది గార్డియన్ ప్రకారం, రిషి సునక్ అనేక మిలియన్ పౌండ్ల విలువైన భార్య ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యారని ఆరోపించింది.. ఈ విషయంపై ప్రారంభించిన దర్యాప్తులో తన భార్య ఆర్థిక నివేదిక లో ఆమె కాటమరాన్ వెంచర్స్ అనే చిన్న సంస్థకు యజమాని అని తెలుసుకున్నారు.
అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కుమార్తె. ఈమెకి ఇన్ఫోసిస్ కంపెనీ లో జిబిపి 480 మిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. దాని విలువ సుమారుగా రూ.4200 కోట్లు. ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ వ్యక్తిగత సంపద జిబిపి 350 మిలియన్లు సుమారుగా రూ.3,400 కోట్లు.. ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక ప్రకారం అక్షిత మూర్తి గ్రూప్లో 0.91వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఆ వాటా విలువ జిబిపి430 మిలియన్లు. ప్రతి సంవత్సరం ఆమె వాటాలు మిలియన్ల డివిడెండ్లుకు అనుమతిస్తాయి. భారతదేశంలో అమెజాన్ తో కలిసి జిబిపి 900 మిలియన్ల జాయింట్ వెంచర్ తో సహా నారాయణమూర్తి ఆమె కుటుంబం అనేక ఇతర ఆస్తులు కలిగి ఉన్నాయని గార్డెన్ పరిశోధనలో తేలింది. ఈ విషయంపై దర్యాప్తు చేసిన యుకె ప్రభుత్వ ఎథిక్స్ వాచ్ డాగ్ కోసం ఇప్పటికే డిమాండ్లు ఉన్నాయి. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంతర్గత సలహాదారులు రిషి సునాక్ ఆర్థిక విషయాలు వెల్లడి పై సంతృప్తి వ్యక్తం చేశారు. అతను మంత్రివర్గ ప్రవర్తన నియమావళిని సరిగానే పాటించారని తెలిపారు.