ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా ప్రజలతోపాటు వ్యవస్థలను నాలుగు నెలలుగా నీరు గార్చేసింది. ఇందులో విమానయానం కూడా ఉంది. ఇతర దేశాలతోపాటు భారత్ లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురువారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భారత పౌర విమానశాఖ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులు నడవనున్నాయి. అయితే.. ప్రయాణికుల కోసం భద్రతా చర్యలు ఎన్ని తీసుకున్నా వారిలో భయం ఉండనే ఉంటుంది. ప్రయాణికుల్లో భయాన్ని పోగొట్టేందుకు ఇండిగో విమాన సంస్థ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది.
ఇండిగో విమాన ప్రయాణికులకు తమ E6 డబుల సీటింగ్ సేవలను తీసుకొస్తున్నామని ప్రకటించింది. రెండు టికెట్లు కొనుక్కునే అవకాశం కల్పించింది. అంటే పక్క పక్క సీట్లు రెండు బుక్ చేసుకోవడంతో ఇతర ప్రయాణికులతో భౌతిక దూరం పాటించినట్టు అవుతుంది. కేవలం కంపెనీ వెబ్ సైట్లో మాత్రమీ ఈ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఈనెల 24న ఈ ఆఫర్ ప్రారంభించనుంది ఇండిగో. అదనపు సీట్ బుకింగ్ కు అసలు ధరలో 25శాతం తక్కువ చేశామని పేర్కొంది. ఇప్పటికే విమానంలో శానిటైజర్స్, మాస్కులతో భద్రతా చర్యలు తీసుకుంటున్నా.. ప్రయాణికుల్లో భయం పోగొట్టేందుకే ఈ అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది ఇండిగో.
ఈ అవకాశంలో ప్రయాణికులు నిర్భయంగా ప్రయాణం చేయొచ్చని తెలిపింది. పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రాకపోయినా. ఇప్పుడిప్పుడే వ్యవస్థలు గాడిలో పడుతున్నాయి. వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ విమానయాన సర్వీసులు గతంలోనే నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఇతర దేశాల సర్వీసులు ప్రారంభమయ్యాయి.