న్యూఢిల్లీ: వాన్పిక్ కేసులో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రస్ అల్ ఖైమా ఫిర్యాదుతో నిమ్మగడ్డ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్న సెర్బియా పోలీసులు బెల్గ్రేడ్లో విచారణ చేస్తున్నట్లు సమాచారం.
నిమ్మగడ్డ ప్రసాద్ను అరెస్టు చేయకుండా సురక్షితంగా భారత్కు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని విదేశాంగమంత్రి జై శంకర్కు వైసిపి ఎంపిలు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. నిమ్మగడ్డ వాన్పిక్ కేసులో గతంలో సిబిఐ అరెస్టు చేయగా బెయిల్పై విడుదల అయ్యారు. ప్రస్తుతం ఆయన సెర్బియాలో విహార యాత్రకు వెళ్లగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.