టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఒక వెలుగు వెలుగుతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రాజు 2003 లో నితిన్ నటించిన దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో సక్సస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నాడు. నిర్మాతగానే కాదు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా తన సత్తా ఏంటో చూపించాడు. దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా అందరూ ఆతృతగా ఎదురు చూసేంతగా పేరు సంపాదించుకున్నాడు. చెప్పాలంటే అగ్ర నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి వాటికి దిల్ రాజు గట్టి పోటీ ఇచ్చాడు.
కొత్త హీరోలని వెండి తెరకి పరిచయం చేయాలన్నా..దర్శకులకి లైఫ్ ఇవ్వాలన్నా దిల్ రాజు ముందుంటాడు. అయితే ఇంతకాలం దిల్ రాజు కి ఏ రకంగా ను గట్టి పోటి ఇచ్చిన వాళ్ళు లేరు. కాని ఇప్పుడు కొన్ని నిర్మాణ సంస్థలు దిల్ రాజు కి విపరీతమైన పోటీ ఇస్తున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియోషన్స్ లాంటి నిర్మాణ సంస్థలు ముందుగానే స్టార్ హీరోలకి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ లాక్ చేసేసుకుంటున్నారు. ఆ హీరోలతో స్టార్ డైరెక్టర్స్ ని క్లబ్ చేసి పాన్ ఇండియన్ రేంజ్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేస్తున్నారు.
అయితే దిల్ రాజు ఎవరికి అడ్వాన్స్ ఇవ్వరన్న టాక్ ఉంది. ఏ స్టార్ హీరో డేట్స్ అయినా ఇట్టే పట్టేసేవాడు. అలాంటిది ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే దిల్ రాజు కి పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సంస్థలతో పోటీ పడలేక రేస్ లో వెనక పడ్డారన్న టాక్ వినిపిస్తుంది. కాని దిల్ రాజు మాత్రం ఎప్పుడు రాజు లాగా నే ఉంటాడని చెప్పుకునే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. మరో రెండు రోజుల్లో నాని నటించిన వి సినిమా రిలీజ్ కాబోతుంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత తో కలిసి నిర్మిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో రెండు సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇవి కాకుండా తెలుగులోను మరికొన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా దాదాపు అన్ని సినిమాలని ఓడిసి పట్టుకుంటుంటాడు. కరోనా కంట్రోల్ లోకి రాగానే ఎప్పటి లాగానే దిల్ రాజు దండయాత్ర మొదలవబోతుంది..ఆయన ని ఆపేవారెవరు ఉండరని అంటున్నారు.