రకుల్ ప్రీత్ సింగ్ గత సంవత్సరం మన్మధుడు 2 లో అక్కినేని నాగార్జున సరసన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రకుల్ కి గట్టి షాక్ తగిలింది. మన్మధుడు 2 తర్వాత మళ్ళీ ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా కూడా అవకాశం రాలేదు. అయినా తన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. తెలుగులో సినిమాలు లేకపోయినప్పటికి శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2 లో నటిస్తుంది.
ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అలాగే అయలన్ అన్న మరో కోలీవుడ్ సినిమా తో పాటు రెండు బాలీవుడ్ సినిమాలు అంగీకరించింది రకుల్. గత సంవత్సరం బాలీవుడ్ లో చేసిన దే దే ప్యార్ దే సినిమాతో హిందీలో హిట్ అందుకుంది రకుల్. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్స్ అజయ్ దేవగన్, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా హిట్ కావడంతో అక్కడ వరసగా అవకాశాలు దక్కించుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ గ్లామర్ బ్యూటి ఇంస్టాగ్రామ్ లో 15 మిలియన్ల ఫాలోయింగ్ మార్క్ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ మాత్రమే టాప్ లో ఉంది. ఈ సందర్భంగా తన అభిమానులకు రకుల్ ధన్యవాదాలు తెలిపింది. రకుల్ తర్వాత గ్లామర్ బ్యూటీ కాజల్ 14.8 మిలియన్స్ తో సెకండ్ పోసిషన్ లో ఉంది. అలాగే శృతిహాసన్ 14.4 మిలియన్స్.. పూజాహెగ్డే 11.2 మిలియన్స్.. ఇలియానా 12.7 మిలియన్స్.. సమంత, తమన్నాలు 11.1 మిలియన్ల ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. వీరితో పాటు మరికొంతమంది హీరోయిన్స్ తమ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్లాన్ లో ఉన్నారు.