ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో వారసులు తప్ప వారసురాళ్లు సక్సెస్ అయిన దాఖలాలు కనిపించలేదు. కానీ ఆ చరిత్ర మార్చాలి అన్న ఉద్దేశం తో నిహారిక కొణిదెల ఇండస్ట్రీకి వచ్చింది కానీ ఆమెకి అది సాధ్యం కాలేదు. ఇప్పటికి మూడు సినిమాలు చేసినప్పటికీ తనకు కనీస గుర్తింపు రాలేదు.
‘ఒక మనసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గ వచ్చింది కానీ ఆ సినిమా విజవంతం కాలేదు. తన రెండో సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ మరియు ‘సూర్యకాంతం’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా మిగిలాయి. తన కథల ఎంపిక గురించి చాలా విమర్శలు వచ్చాయి.
కనీసం కథల ఎంపిక కూడా తనకు చేత కావడం లేదు అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ విజయ్ సేతుపతితో నటించిన ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తాను నటించిన ప్రతీ సినిమా ఫ్లాప్ కావడంతో ఇక సినిమా రంగానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇంకొకపక్కన పెళ్లి తర్వాత నిహారిక సినిమాలు చెయ్యదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపై సినిమాలకు బాయ్ బాయ్ చెప్పి వెబ్ సిరీస్ల పైనే నిహారిక దృష్టి పెట్టనున్నదట.
ఇటీవల కొణిదెల నిహారిక ‘పింక్ ఎలిఫెంట్’ అనే నిర్మాణ సంస్థను తన సొంతగా మొదలుపెట్టింది. ఈ నిర్మాణ సంస్థలోనే నాన్నకూచి మరియు ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్లను నిర్మించింది. ఆ రెండు వెబ్ సిరీస్ లు అనుకున్న ఫలితాన్ని ఇవ్వడంతో ఇక పెళ్లి తర్వాత వెబ్ సిరీస్లపైనే దృష్టి పెట్టాలని చేస్తోందట. నిహారిక ఇకపై నటనకు దూరంగా ఉంటూ కేవలం నిర్మాతగానే సినిమా రంగంలో ఉండడానికి మక్కువ చూపిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.