Pushpa : మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ రోజు ఆ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అందులో వెల్లడించారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించనుంది. ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరమే ప్రారంభం అయింది. అయితే కరోనా కారణంగా చాలా షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ ప్రారంభమైంది. ఏకధాటిగా అల్లుఅర్జున్ తో సహా మిగిలిన కీలక ఆర్టిస్టులు అందరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఎర్రచందనం లింక్ తో ఒక మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా మొరటుగా కనిపిస్తున్నాడు. పోస్టర్ విషయానికి వస్తే అడవిలో పనిచేసే కూలీలతో గొడ్డల్లు పట్టుకుని అల్లుఅర్జున్ కనిపించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పేరు పుష్ప నాయక్ అని కథనాలు వైరల్ అవుతున్నాయి.
Pushpa ని పట్టేశారుగా….
అంతకుముందు పుష్ప టైటిల్ పోస్టర్ ను యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు రిలీజ్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత మామూలుగానే ఫ్యాన్స్ చిన్న చిన్న డీటెయిల్స్ వెతకడం మొదలు పెట్టేశారు. ఇందులో వారు ఒక పెద్ద ఎలిమెంట్ పట్టేశారు. విషయం ఏమిటంటే…. టైటిల్ పోస్టర్ లో అల్లు అర్జున్ ఎడమ కాలుకి ఆరు వేళ్ళు ఉన్నాయి. కానీ రిలీజ్ పోస్టర్ లో మాత్రం 5 వేళ్ళే కనిపించాయి. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నాడా… అని అనుమానం అందరికీ వచ్చింది.
పైన ఇమేజ్ ఇమేజ్ చూసినట్లయితే…. మొదటి పోస్టర్ పోలీస్ స్టేషన్ లోనిది. అందులో ఆరు వేళ్ళు ఉన్నాయి. తర్వాత పోస్టర్…. అటవీ ప్రాంతంలోది. అందులో అల్లుఅర్జున్ ఎడమ కాలుకి ఐదు వేళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇక దీనిని పట్టుకొని అల్లు అర్జున్ అభిమానులు వైరల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి సుకుమార్ ఈ సినిమాలో కూడా ట్విస్తులు పెట్టినట్లు అర్థం అవుతోంది. లాజిక్ ల పై ఎక్కువగా ఆధారపడే సుకుమార్ ఈ ‘పుష్ప’ సినిమాతో ఫ్యాన్స్ కు ఎలాంటి థ్రిల్ కలిగిస్తాడు అని అందరు ఎదురు చూస్తున్నారు.