Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి దివ్య ఇచ్చిన షాక్ కి మెంటల్ ఎక్కి పోతూ ఉంటుంది. కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే.. అంతలో వాళ్ళ తమ్ముడు వచ్చి.. అక్క ఆ దివ్య ని ఉంచి అదుపులో పెట్టుకోమని చెప్పాను. నువ్వింటేగా.. మాదివ్య..మా దివ్య అని అన్నావు. ఇప్పుడు చూసావా ఏమైందో అంటూ రాజ్యలక్ష్మి తమ్ముడు కూడా తనదే తప్పంటూ తిడతాడు.
మరోవైపు దివ్య చేసిన పనికి హాస్పిటల్లో స్టాఫ్ అంతా వచ్చి తనని విష్ చేస్తూ ఉంటారు నేనేం అంత మంచి పని చేయలేదని నేను చేయగలిగిన సహాయమే తనకు చేశానని దివ్య చెబుతుంది ఏమైంది గురుడు ఇంకా ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేస్తే కట్ చేశాడు అని దివ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. విక్రమ్ ఇంకా ఫోన్ చేయలేదు అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి దేవుడు బోకే తీసుకొని వచ్చి ఇస్తాడు. అది చూసి దివ్య లోపల మురిసిపోతూ ఉంటుంది.
సంజయ్ తన భార్యను తీసుకుని గుమ్మం బయట నిలబడతాడు ఇక రాజ్యలక్ష్మి వాళ్ళిద్దరూ చేతిలో చేయి వేసుకొని పట్టుకోవడం చూసి లో లోపల రగిలిపోతూ ఉంటుంది విక్రమ్ కి ఇలాంటి పనికిరాని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను కానీ ఎంజాయ్ కి ఇలాంటి పడుతుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ లో లోపల మదన పడుతూ ఉంటుంది రాజ్యలక్ష్మి ఇక పంతులు గారిని పిలిపించి కోడలు జాతకంలో తప్పు ఉందని ఇంట్లోకి అడుగుపెడితే అరిష్టమని 110 రోజులపాటు శివుడికి నూట ఒక్క బిందెలతో అభిషేకం చేసి ఆ తరువాత ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలి అనే కండిషన్ను పెడుతుంది రాజ్యలక్ష్మి కి కొత్త కోడలు కూడా ఒప్పుకుంటుంది.
నందు తులసి తో పాటు వాళ్ళింట్లో వాళ్ళందరూ క్యారమ్స్ గేమ్ ఆడుతూ ఉండగా రాసి వచ్చి నేను ఒక దాన్ని కూడా ఉన్నాను నాతో గెలవడం అంత సులువైన విషయం కాదు అని లాస్య సవాల్ విసురుతుంది ఆటలో అంతలో భాగ్య ఫోన్ చేస్తుంది లాస్యకి ఇక విక్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను అలాగే దివ్య హాస్పిటల్లో చేసిన రాద్ధాంతం మొత్తం భాగ్య వివరంగా లాస్యకు చెబుతుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో దివ్య మీకు ఏదో గుర్తు వచ్చింది అంటూ లాస్య ఆ బుకే తీసుకొని వస్తుంది. ఓకే మీద ఎవరి పేరు ఉందో చూసి ఇస్తానని లాస్య అనగానే ఆంటీ వద్దు అంటూ దివ్య ముందుకు వస్తుంది. లాస్య ఆ బొకే తీసుకువెళ్లి తులసి చేతిలో పెడుతుంది ఇక తులసి ఆ పేరు చూసి కళ్ళు పెద్దవిగా చేస్తుంది..