డబ్బును పొదుపు చేయాలని చూసే అనేక మందికి ప్రస్తుతం అనేక రకాల పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) స్కీం. ఇందులో నెల నెలా కొంత మొత్తంలో డబ్బును పొదుపు చేస్తూ వెళితే.. కొన్నేళ్లకు పెద్ద మొత్తంలో డబ్బు పొందవచ్చు. పీపీఎఫ్ స్కీంలో పెట్టే మొత్తానికి ఏడాదికి 7.1 శాతం వడ్డీ చెల్లిస్తారు.
పీపీఎఫ్ స్కీం కాల వ్యవధి 15 సంవత్సరాలు. ఆ తరువాత అందులో పెట్టిన డబ్బు మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే 15 ఏళ్లు పూర్తయ్యాక స్కీంను 5 ఏళ్ల చొప్పున పెంచుకుంటూ కూడా పోవచ్చు. దీంతో పెద్ద మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ స్కీంలో రోజుకు రూ.250 చొప్పున అంటే.. నెలకు రూ.7,500 పెట్టుబడి పెడితే మెచూరిటీ అయ్యే వరకు.. అంటే.. 15 ఏళ్ల తరువాత రూ.26 లక్షలు వస్తాయి.
ఇక స్కీంను మరో 10 సంవత్సరాల పాటు మళ్లీ పొడిగిస్తే.. రూ.70 లక్షలు పొందవచ్చు. ఈ క్రమంలో రోజుకు కేవలం రూ.250 పెట్టడం ద్వారా పీపీఎఫ్ స్కీంలో ఏకంగా ఒకేసారి రూ.70 లక్షలు పొందవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన లాభాలు రావాలన్నా.. వృద్ధాప్యంలో ఏ చింతా లేకుండా జీవించాలన్నా ఈ స్కీంలో పెట్టుబడి పెడితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి.