ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో సీబీఐ అధికారుల సుదీర్ఘ విచారణ ముగిసింది. దాదాడు ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు కవితను విచారించారు. అయిదుగురు సభ్యుల సీబీఐ బృందం ఈ ఉదయం 11 గంటలకు కవిత నివాసానికి చేరుకున్నారు. సీబీఐ అధికారుల విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతరులు ఎవరూ ఆ ప్రాంతంకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
విచారణ లో భాగంగా సీ బీ ఐ అధికారులు కవిత నివాసంలోని ఒక ప్రత్యేక గది లో న్యాయవాదుల సమక్షం లో ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. అరోరా చెప్పిన వివరాలు ఆధారంగా గతంలో కవిత ఉపయోగించిన ఫోన్ల వివరాలను అడిగినట్లుగా భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ నకు సంబందించిన పలు అంశాలపై సీబీఐ అధికారులు విచారించినట్లు తెలిసింది. అయితే రేపు కూడా విచారణ జరుపుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
KCRs BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్
మరో పక్క కవితను సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో పేద్ద సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు ఆమె నివాసం వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తన నివాసం వద్దకు పార్టీ కార్యకర్తలు రావద్దని ముందుగానే కవిత విజ్ఞప్తి చేసినప్పటికీ కొందరు పార్టీ శ్రేణులు వచ్చారు.
Janasena: జనసేనకు ఆర్టీఏ అధికారులు షాక్ .. వారాహి రిజిస్ట్రేషన్ తిరస్కరణ