IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఎంతటి బలమైన జట్టు అనేది అందరికీ తెలుసు. హత ఆరేళ్ళలో అసాధారణ్ ఆఅతీరుతో వారు ఛాంపియన్ జట్టుగా అవతరించారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకొని ఈ సారి కూడా హాట్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతున్నారు.
అయితే ఈసారి ఐపీఎల్ లో మాత్రం ముంబై కి గడ్డు పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. అందుకు కారణం వారి సొంత స్టేడియం అయిన వాంఖడేలో వారికి ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడమే. కానీ చెన్నై లో మాత్రం 5 మ్యాచ్ లు ఉన్నాయి. చెన్నై స్లో పిచ్. అక్కడ స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తుంది. ఈరోజు జరిగే కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్ కి చెన్నై లోనే కావడం విశేషం.
ఇక బలబలాల విషయానికి వస్తే చెలరేగింది సాధారణంగా కోల్కత్తా మిడిలార్డర్ పటిష్టంగా ఉంటుంది. అయితే మొన్న వారి టాప్ ఆర్డర్ రెచ్చిపోయింది. వారికి మిదిల్ ఆర్డర్ ప్రధాన బలం అయితే టాప్ ఆర్డర్ రెచ్చిపోవడం కలిసొచ్చే అంశం. అలాగే నైట్ రైడర్స్ కి హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి అని ఇద్దరు మేతి స్పిన్నర్లు ఉన్నారు. కానీ ముంబై కి మాత్రం రాహుల్ చాహార్ ఒక్కడే స్పిన్నర్. అతనికి కూడా పెద్దగా అనుభవం లేదు.
నైట్ రైడర్స్ లో భారీ హిట్టర్లు ఉన్నారు. వారిలో లోపాలు కుడా పెద్దగా కనిపించడం లేదు. హార్దిక్ పాండ్యా, పొలార్డ్, రోహిత్ ఇంకా ఫామ్ అందుకోవాల్సి ఉంది. క్రిస్ లిన్ గత మ్యాచ్ లో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డి కాక్ వస్తే ఇదీ తలనొప్పి వ్యవహారమే. మొదటి మ్యాచుల్లో బెంగళూరు చేతిలో ఓడిన ముంబై ఈరోజు గెలవడం అంత సులువైన పని కాదు.