IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా రోహిత్ శర్మకు అసామాన్య రికార్డు ఉంది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అత్యధికంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన తొలి కెప్టెన్ గా రోహిత్ శర్మ గత సీజన్లో ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్స్ గా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
ఈ సంవత్సరం కూడా ముంబై ఇండియన్స్ కనుక గెలుచుకుంటే ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి హ్యాట్రిక్ ట్రోఫీలు గెలిచిన టీమ్ గా అవతరిస్తుంది. అంతేకాకుండా రోహిత్ శర్మ కి కెప్టెన్ గా ఐపీఎల్ లో పలు రికార్డులు ఉన్నాయి. ఒక సీజన్లో రోహిత్ శర్మ తన జట్టులోని ఆటగాళ్లు లో… ఇంతకుముందు కెప్టెన్సీ వహించిన చరిత్ర ఉన్న ముగ్గురు మాజీ కెప్టెన్ లకి సారథిగా గా వ్యవహరించడం జరిగింది.
2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మఅంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టు కే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సచిన్, రిక్కీ పాంటింగ్, హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్లకు అదే సీజన్లో సారధ్యం వహించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు రోహిత్ శర్మ పేరు పైన ఉండేది. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ కెప్టెన్ గా నియమితులైన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ లో మాజీ కెప్టెన్లు అయిన నలుగురు సభ్యులకి కెప్టెన్ గా ఉండనుండం విశేషం.
డిల్లీ లో ఉండే ధావన్, అశ్విన్, రహానె, స్టీవ్ స్మిత్ ఇంతకుముందు వివిధ ఐపీఎల్ జట్లకి సారథ్యం వహించారు. హైదరాబాద్ జట్టుకి ధావన్ గతంలో కెప్టెన్ గా ఉన్నాడు. అశ్విన్ రెండు సార్లు పంజాబ్ కెప్టెన్ గా చేశాడు. రహానే కూడా రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఉన్నాడు. స్మిత్ పూణే వారియర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకి కెప్టెన్ గా ఉన్నాడు. ఇంగ్లండ్ వన్డే సిరీస్ లో గాయపడిన అయ్యర్ స్థానంలో పంత్ దిల్లీ కొత్త కెప్టెన్ గా నియమితుడయ్యాడు.