IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృంభించడంతో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విరాట్ కెప్టెన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన ధోని వాంఖడే స్టేడియంలో మొదటి బ్యాటింగ్ తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తొలి ఇన్నింగ్స్లో చెన్నై జట్టు 20 ఓవర్లలో కీ 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు వీరిద్దరూ కలిసి 74 పరుగులు జోడించారు. పవర్ ప్లే లో కూడా 51 పరుగులు సాధించి చెన్నై భారీ స్కోరు సాధించేందుకు పునాది చేశారు. అయితే ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ భారీ స్కోర్లు సాధించలేకపోయారు.
రైనా 24 పరుగులు చేస్తే రాయుడు 7 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 19 ఓవర్లకి కి చెన్నై జట్టు స్కోరు 154 పరుగులు మాత్రమే చేశారు. అయితే చివరి ఓవర్లో ఐపీఎల్ లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసుకున్న ఆర్సిబి బౌలర్ హర్షల్ పటేల్ ని రవీంద్ర జడేజా 20వ ఓవర్లో 37 పరుగులు బాదాడు. అందులో 5 సిక్సులు, ఒక బౌండరీ ఉన్నాయి. కేవలం 25 బంతుల్లో జడేజా 62 పరుగులు సాధించాడు. దీంతో చెన్నై భారీ స్కోరు సాధించింది.
బదులుగా ఛేజింగ్ దిగిన బెంగళూరు బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ మళ్ళీ అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. 15 బంతుల్లో 34 పరుగులు చేసిన పడిక్కల్ దెబ్బకు బెంగళూరు పవర్ ప్లే లో 65 పరుగులు సాధించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగడం… వెంటనే పడిక్కల్ కూడా అవుట్ కావడంతో రాయల్ ఛాలెంజర్స్ పతనం మొదలైంది.
బెంగళూరు బ్యాట్స్మెన్ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లు వెనుదిరగడంతో బెంగళూరు ఏ దశలోనూ గెలిచే స్థితిలో కనిపించలేదు. బ్యాట్ తో సత్తా చాటిన జడేజా బంతితో కూడా మెరిశాడు. 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చిన రవి జడేజా మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ ఇలాంటి కీలక పేర్లను జడేజా తన బౌలింగ్లో బౌల్డ్ చేయడంతో బెంగళూరు ఓటమి తప్పలేదు. అలాగే జడేజా ఒక రనౌట్ కూడా చేశాడు. మొత్తానికి జడేజా ధాటికి బెంగళూరు 69 పరుగుల తేడాతో చెన్నై చేతిలో చిత్తుగా ఓడిపోయింది.