IPL 2021 : ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కి విశేషమైన ఆదరణ ఉంది. వారి ఫ్యాన్స్ అత్యంత విశ్వాసపాత్రులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. బెంగళూరు మొదటి సీజన్ నుండి బలమైన జట్టు అయినప్పటికీ స్టార్లతో నిండిపోయినప్పటికీ వారు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయారు. అయినా వారికి ఫ్యాన్ ఫ్లోయింగ్ తగ్గలేదు. ఎన్నోసార్లు వారిని కీలక మ్యాచ్లో దురదృష్టం వెక్కిరించింది. పైగా ప్రతీసారి వారి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎంతో బలహీనంగా ఉండేది.
కోహ్లీ, ఎబి డివిలియర్స్ వంటి స్టార్లు ప్రతి సీజన్లో జట్టును ఆదుకున్నప్పటికీ టైటిల్ వరకు వెళ్లడం అనేది వారి శక్తికి మించిన పని అయింది. మిగతావారి నుండి పెద్దగా సహకారం ఉండేది కాదు. అయితే ఈ సీజన్ లో ఆర్సీబి ఆస్త్రేలియా భీకర బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ పైన ఆర్సిబి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్ కు ముందు జరిగిన వేలం పాటలో వారు మ్యాక్స్వెల్ ను అతి భారీ రేటు పెట్టి కొన్నారు.
గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మ్యాచ్ లలో ఘోరంగా విఫలమయ్యాడు. అతను ఐపీఎల్ లో 50 పరుగులు చేసి సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ ఆర్సిబి అతని హిట్టింగ్ సామర్థ్యంపై ఎంతో నమ్మకం ఉంచి భారీ డబ్బులు వెచ్చించారు. ఈసారి మ్యాక్స్వెల్ క్లిక్ అయితే బెంగళూరు ప్లే- ఆఫ్స్ చేరుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. బౌలింగ్ లో కూడా ముగ్గురు విదేశీ ఆల్రౌండర్లు సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడు.
స్పిన్ డిపార్ట్మెంట్ కూడా కుదురుకున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి మ్యాక్స్వెల్ కనుక ఈ సారి సత్తా చాటితే ఈసారి ఆర్సీబి టైటిల్ గెలిచే అవకాశాలు బాగా మెరుగవుతాయి.