IPL 2021 : ఏప్రిల్ 9వ తేదీ నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఫైనలిస్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అంతవరకు వెళ్లడానికి శ్రేయస్ అయ్యర్ పాత్ర ప్రధానమైనది. అయితే ఈ ఏడాది అతను ఐపీఎల్ లో పాల్గొనేది అనుమానమే అని చెబుతున్నారు.
నిన్న ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ ఎడమ భుజం గాయపడింది. దానికి మరొక రెండు రోజుల్లో సర్జరీ చేయనున్నారు. ఈ క్రమంలో వన్డే సిరీస్ అయ్యర్ మొత్తానికి దూరం అయ్యాడు. అలాగే సర్జరీ జరిగిన తర్వాత అయ్యర్ కనీసం మూడు నుంచి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు.
ఇలాంటి సమయంలో అతను ఐపీఎల్ ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. ఐపీఎల్ మొదటి అర్ధభాగం దూరం అవుతాడని కొన్ని రిపోర్టులు వస్తే… కొంత మంది మాత్రం పూర్తిగా ఐపిఎల్ కే దూరం కావచ్చని అంటున్నారు. అయ్యర్ దూరమైతే దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో స్మిత్, రహానే, పంత్ ఉన్నారు.