IPL NEW RULES : ఐపీఎల్ -2022 సీజన్ కోసం BCCI ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రెండు కొత్త జట్లకోసం వేళం నిర్వహించగా.. రిటెన్షన్ విధానంలో ప్రతీజట్టు నలుగురు ఆటగాళ్లను తమతో ఉంచుకోవచ్చని, మిగతా వారిని మార్చుకోవాల్సి ఉంటుందుని పేర్కొంది. వచ్చే ఐపీఎల్ 2011లో జరిగిన ఫార్మాట్ ప్రకారం ఉండనుంది. లీగ్ దశలో మొత్తం 74 మ్యాచ్లు ఉంటాయి. ఈసారి రైట్-టు-మ్యాచ్ అనే రూల్ను బీసీసీఐ (BCCI) తొలగించింది.
IPL: రద్దయిన 2021 ఐపీఎల్ మ్యాచ్ లు..!!
కొత్త రిటెన్షన్ రూల్స్ ఇవే..
కొత్త రిటెన్షన్ రూల్స్ ప్రకారం.. ముగ్గురు ఇండియన్(Indian) లేదా ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరు ఇండియన్, ఇద్దరు ఫారిన్ ఆటగాళ్లు ఉంటారు.ఈ సారి రైట్-టు-మ్యాచ్ కార్డు తీసేయడం ద్వారా ఏదైనా ఫ్రాంచైజీ తమ కీలక ప్లేయర్ను వదులుకుంటే, అతన్ని వేరే ఫ్రాంచైజీ వాళ్లు కొనుక్కుంటే రైట్-టు-మ్యాచ్ ప్రకారం సొంత ఫ్రాంచైజీ తిరిగి తీసుకునే వీలుండదు. అందుకే ప్లేయర్ను వదులుకునే ముందే ఆలోచించాలి.
IPL: ఐపీఎల్ 2022 లో జరగనున్న మార్పులు ఇవే…
ఎనిమిది జట్లతో ఉండేది మొత్తం 32 మంది ఆటగాళ్లే..
కొత్త రిటెన్షన్ విధానం వలన పాత జట్లు కేవలం 32 మంది ఆటగాళ్లను మాత్రమే తమతో ఉంచుకుంటారు. మిగిలిన వారంతా సెంట్రల్ పూల్ లోకి వెళ్తారు. దీంతో కొత్తగా వచ్చిన రెండు ఫ్రాంచైజీలకు నష్టం కలుగకుండా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజాగా ‘ఫ్రీ పికప్’ ఆప్షన్ తేవడం వలన పాత జట్లు వదులుకున్న ఆటగాళ్లను కొత్త ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు. వేలానికి ముందే ముగ్గురు కీలక ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. అయితే, లక్నో జట్టుకు ఈ అవకాశం ముందు ఉన్నది. ఎందుకంటే బీసీసీఐకు ఎక్కువ డబ్బులు చెల్లించింది ఆ జట్టే కాబట్టి.
IPL 2021: మరో భారత క్రికెటర్ కు కరోనా పాజిటివ్..!
కాగా ఈసారి వేలంలో పర్స్ విలువను రూ. 85 కోట్ల నుంచి రూ. 90 కోట్లకు పెంచారు. రిటెన్షన్, ఫ్రీ పికప్ విధానంలో ఆటగాళ్ల కొనుగోలుకు రూ. 90 కోట్లను వినియోగించాలి. రిటైన్ చేసుకున్న క్రికెటర్ల జీతాలను కూడా ఈసారి బీసీసీఐ నిర్ణయించింది.