సుమారు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానుల్ని ఉర్రుత లుగించిన ఐపీఎల్ సీజన్ ఘనంగా ముగిసింది. కోవిడ్ సమయంలో సాయంత్రపు వినోదాల జల్లుకి విరామం వచ్చినట్లే. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ లో ముంబై సునాయస విజయం దక్కించుకుంది. మొదటిసారి ఫైనల్ వరకు చేరిన ఢిల్లీను చిత్తు చేసి 5వ సారి కప్పు కొట్టేసింది. ఫైనల్స్ లో ఢిల్లీ కనీస పోరాటం ఇవ్వలేకపోయింది.
జోరు కొనసాగించలేక..!!
ముంబై లాంటి బ్యాటింగ్ అయిన భారీ బాటింగ్ లైన్ అప్ ఉన్న టీంను ఎదుర్కోవాలంటే భారీ స్కోరు అవసరం. మొదట బాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ ఈ విషయంలో తడబడింది. స్టోనిస్, ధావన్, రహానే వికెట్లు వెనువెంటనే పడటం ఢిల్లీను దెబ్బతీసింది. ఓపెనర్లు భాగస్వామ్యం లేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఢిల్లీ విషయంలో కూడా ఇదే జరిగింది. మూడు వికెట్లు వెనువెంటనే పడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్-కీపర్ రిషబ్ పంత్ లు చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. 4వ వికెట్ కు 80 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరు అర్ధ సెంచరీలు చేసి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో పంత్ అవుట్ అవ్వడంతో సుమారు 8 రన్ రేట్ పైనే ఉన్న ఢిల్లీ టీమ్ చతికిల పడింది. అప్పటివరకు ఒక వికెట్ కోసం శ్రమించిన ముంబై బౌలర్లకు అవకాశం చిక్కింది. డెత్ ఓవర్లలో పట్టు బిగించారు. బూమ్రా బోల్ట్ వంటి బౌలర్లకు రెండు ఓవర్లు మిగిలి ఉండటంతో తో వారిని ఎదుర్కోవడం ఢిల్లీ లోయర్ ఆర్డర్కు కష్టతరమైంది. ఫలితంగా 180 నుంచి 200 మధ్యలో స్కోర్ వస్తుంది అని ఊహించిన ఢిల్లీ అభిమానుల కల తీరలేదు. 157 రన్స్ మాత్రమే సాధించి ముంబై కు స్వల్ప టార్గెట్ ఇవ్వడం తో వారి కి చేదన సులభతరమైంది.
వికెట్లు తీయలేక!!
ముంబై లాంటి గట్టి బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న టీమును ఛేజింగ్ విషయంలో కట్టడి చేయాలంటే వెనువెంటనే వికెట్లు తీయడం ముందున్న లక్ష్యం. దీన్ని ఢిల్లీ బౌలర్లు అందిపుచ్చుకో లేకపోయారు. కీపర్ డికోక్ వికెట్ 5 ఓవర్లో తీసినా, అప్పటికే డికోక్ చేయాల్సిన నష్టం చేసి వెళ్ళిపోయాడు. 3 సిక్స్ లు, 2 ఫోర్లతో 30 పైగా రన్స్ సాధించాడు. స్కోర్ బోర్డ్ మీద 10 రన్ రేట్ పైనే సాధించి ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్, కిషన్ దీన్ని కొనసాగించారు. కెప్టెన్ రోహిత్ చివరి గేమ్ లో ఫామ్ లోకి వచ్చి నిలకడగా ఆడి 68 రన్స్ సాధించడం ముంబై కు అదనపు మైలేజ్ ఇచ్చింది. లక్ష్యం చిన్నదై పోతున్న సమయంలో ముంబై బ్యాట్స్ మెన్స్ వికెట్స్ వరుసగా పడ్డాయి. రోహిత్ శర్మ, పొలార్డ్ , పాండ్య వెంటనే పెవిలియన్ చేరారు. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదే వికెట్లను ఢిల్లీ బౌలర్లు ముందు తీసి ఉంటే మ్యాచ్ పై పట్టు సాధించే వారు. మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగేది.
సమష్టి తత్వమే లోపించింది!!
ఢిల్లీ ఓటమికి అనేక కారణాలు వెతికి న, గట్టు లో ముఖ్యంగా సమష్టి తత్వం లేకపోవడమే వారి ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. టాపార్డర్ కీలకమైన సమయంలో రాణించక పోవడం ఒక ఎత్తయితే మిడిలార్డర్లో వచ్చిన వారు అందించిన భారీ స్కోర్ బాధ్యతలు మిగిలినవారు అందిపుచ్చుకోవడం మైనస్. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పటిష్టంగా ఉన్న ముంబై బౌలర్లు పై ఎదురు దాడి చేసేందుకు ఢిల్లీ బ్యాట్స్మెన్ తంటాలు పడ్డారు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ ఆడిన తరహా ఆటను మిగిలినవారు కొనసాగించలేకపోయారు. ఇది మరో లోపం. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో ఢిల్లీ పూర్తిగా చతికిల పడిందనే చెప్పాలి. ఫైనల్ మ్యాచ్లో పర్పుల్ క్యాప్ విన్నర్ రబడ సైతం ఎలాంటి ప్రభావం చూపలేక పోయాడు. నొర్ట్ జా భారీగా పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లు రన్స్ కట్టడి చేయలేకపోయారు. వికెట్లు పడటం లేదు అని అర్ధం అయ్యాక రన్ రేట్ తగ్గించే పటిష్టమైన బౌలింగ్ వేయలేకపోయారు. ఇది ప్రణాళిక లోపమే. కెప్టెన్ అయ్యర్ ముంబై బ్యాట్సమెన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ, ప్లాన్ లేకుండానే బరిలోకి దిగినట్లు అర్థం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు వంద కారణాల్లా కనిపించినా, ముంబై 6వ సారి కప్పు కొట్టడంలో మాత్రం నిలకడగా రాణించింది అని చెప్పాలి.