IPS ABV: ఏపి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. ఆయన పెగాసస్ స్పైవేర్ పై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఏవి వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఏబి వెంకటేశ్వరరావుపై గతంలో కొన్ని అభియోగాలు కారణంగా జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ సాఫ్ట్ వేర కొనుగోలు అంశంపై చేసిన ఆరోపణలు ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ తో అధికార వైసీపీ.. టీడీపీ పై, చంద్రబాబుపైనా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను టీడీపీ కొట్టిపారేస్తోంది. మరో పక్క దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఇజ్రాయిల్ కంపెనీ ఆర్టీ ఇన్ స్టేటబుల్ ఫ్రాంచైజీగా ఉన్న అప్పటి ఇంటిలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు తనయుడు సాయికృష్ణను విచారిస్తే పెగాసెస్ గుట్టు బయటకు వస్తుంది అంటూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి రెడ్డి తన కుమారుడు పేరు ప్రస్తావించిన క్రమంలో ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుండటంతో దీనిపై వివరణ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.