అమరావతి: రాష్ట్రంలో మరో 21మంది ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీ ఎత్తున ఐఎఎస్, ఐపిఎస్ బదిలీలు చేశారు. నిన్న 40మంది ఐఎఎస్, ఇద్దరు ఐపిఎస్, ఐఆర్పిఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం నేడు మరో 21మంది ఐపిఎస్లను బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో లూప్ లైన్లో పని చేసిన అధికారులకు ప్రాధాన్యత పోస్టులు దక్కుతున్నాయి. ప్రాధాన్యత పోస్టుల్లో పని చేసిన వారిలో పలువురు అధికారులను లూప్లైన్లోకి బదిలీ అవుతున్నారు.
బదిలీ అయిన అధికారుల వివరాలు..
- అనురాధ – రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపకశాఖ డిజిఎన్ బాలసుబ్రమణ్యం – జిఏడి
- ఎన్. శ్రీధర్ రావు – పోలీస్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడిజి
- ఆర్కె మీన -విశాఖపట్నం పోలీస్ కమిషనర్
- మహేష్ చంద్ర లడ్హా – పోలీస్ పర్సనల్ ఐజి
- కె. సత్య నారాయణ – పిటిఒ ఐజి
- బి. శ్రీనివాసులు – ఏపిఎస్పి ఐజి
- వినీత్ బ్రిజ్ లాల్ -గుంటూరు రేంజ్ ఐజి
- ఘట్టమనేని శ్రీనివాస్ – పోలీస్ హెడ్ క్వార్టర్
- సిహెచ్ శ్రీకాంత్ – ఇంటెలిజెన్స్ (ఎస్.ఐ.జి) డిఐజి
- జి. పాల్ రాజ్ – టెక్నికల్ సర్వీసెస్ డిఐజి
- ఎన్.కె.వి. రంగారావు – విశాఖపట్నం రేంజ్ డిఐజి
- ఎస్. హరికృష్ణ – అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఐజి
- కెవి మోహన్ రావు- ఇంటలిజెన్స్ ఎస్పి
- జివిజీ అశోక్ కుమార్- సిఐడి ఎస్పి
- సర్వశ్రేష్ట త్రిపాఠి – అనంతపురం ఎపిఎస్పి బెటాలియన్ కమాండెంట్
- కోయ ప్రవీణ్- పోలీస్ హెడ్ క్వార్టర్
- విక్రాంగ్ పాటిల్ – గుంతకల్లు రైల్వే ఎస్పి
- ఎస్. రంగారావు- విశాఖ శాంతి భద్రతల డిసిపి
- కె. నారాయణ నాయక్ – విజయవాడ రైల్వే ఎస్పి
- ఎం దీపిక – కర్నూలు ఎఎస్పి