Surgical Strike: తాజాగా Pakistan పై మరో సర్జికల్ స్ట్రైక్ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ సారి పాకిస్తాన్ మీద జరిగిన సర్జికల్ స్ట్రైక్ భారత మిలిటరీ చెయ్యలేదు. పాకిస్థాన్ కి శత్రు దేశాలు చాలానే ఉన్నాయి. ఇంతకీ ఏ దేశం పాకిస్థాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసిందో తెలుసా?
అక్టోబర్, 2018వ సంవత్సరంలో పాకిస్ధాన్ లోని బెలూచిస్ధాన్ మరియు ఇరాన్ దేశ సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య గొడవ జరిగింది. చివరికి ఈ గొడవలో భాగంగా పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్ధ జైషే ఉల్ అదు 12 మంది ఇరాన్ సైనికులను కిడ్నప్ చేసి వారిని పాకిస్ధాన్ ల్ ఆదీనంలోనే ఉంచుకున్నది.
ఇది తెలుసుకున్న ఇరాన్ ప్రభుత్వం చర్చలు జరిపి ఇరాన్ సైనికులను విడిచిపెట్టాలని పాకిస్థాన్ ను డిమాండ్ చేసింది. ఇరాన్ దేశం పాకిస్థాన్ మీద ఒత్తిడి తీసుకురాగా పాకిస్ధాన్, ఆ ఉగ్రవాదుల సంస్ధ అగ్రనేతలపై ఒత్తిడి తీసుకురావడంతో ఇక పాకిస్థాన్ రెండు విడతల్లో 12 మందిలోని పదిమంది సైనికులను మాత్రమే విడుదల చెయ్యగా మిగిలిన ఇద్దరిని మాత్రం ఇరాన్ ఎంత ప్రయత్నించినా ఉగ్రవాదుల సంస్ధ విడిడిపెట్టలేదు.
ఈ విషయమై చాలా సార్లు ఇరాన్ చర్చలు జరిపినప్పటికీ వారిని పాకిస్థాన్ విడిచిపెట్టలేదు. ఇక మరోవైపు ఇరాన్ దేశం తన ఇంటెలిజెన్స్ సహాయం తో వ్యూహాలు పన్నింది. ఇరాన్ ఇంటలిజెన్స్ వారు బందీగా ఉన్న సైనికులను కరెక్ట్ గా కనిపెట్ట్టాక హఠాత్తుగా 3వ తేదీన ఇరాన్ ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ ఇరాన్ సైనికులు ఉన్న భవనంపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి కనురెప్ప పాటులో తమ సైనికులను తీసుకుని ఇరాన్ కు సురక్షితంగా వెళ్ళిపోయారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ వివరాలని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రపంచానికి ప్రకటించింది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.