IRCTC: ట్రైన్లలో ఆహారాన్ని అందించే ఐఆర్సీటీసీ సంస్థ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. కొన్ని రైళ్లలో కేవలం శాఖాహార వంటకాలు మాత్రమే పెట్టాలనేది ఆ నిర్ణయం సారాంశం. ఈ నిర్ణయం పట్ల రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రైళ్లు సాత్విక్ సర్టిఫికెట్ ను పొందాయి. అటువంటి రైళ్లలో ఇకపై మనకు శాఖాహారం మాత్రమే పెట్టనున్నారు.
Job Notification : రైల్వే లో అప్రెంటిస్ షిప్ ఖాళీలు ..!!
తీర్థయాత్రలకు వెళ్లే బండ్లలో..
ఎటువంటి రైళ్లలో శాఖాహార భోజనం పెడతారా అని చాలా మంది ప్రయాణికులు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా తీర్థయాత్రలకు వెళ్లే రైళ్లలో ఐఆర్సీటీసీ ( IRCTC) శాఖాహార వంటకాలను వడ్డించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి కత్రా వరకు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో ఈ విధంగా శాఖాహార భోజనం ( meals (పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు వైష్ణో దేవి ఆలయానికి వెళ్తుంది.
Railway recruitment : సెంట్రల్ రైల్వే లో భారీగా ఖాళీలు..!!
రామాయణ ఎక్స్ ప్రెస్ లో కూడా..
కేవలం వందే భారత్ రైలులో మాత్రమే కాకుండా.. నూతనంగా ప్రారంభించిన రామాయణ ఎక్స్ ప్రెస్ తో పాటు మరో 18 రైలు బండ్లలో కూడా వెజిటీరియన్ భోజనాలు పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్ రైలులో కూడా ఇదే పద్ధతిని రైల్వే శాఖ అవలంభించనుంది. ఇక త్వరలో ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న బేస్ కిచెన్ లు, ఫుడ్ లాంజ్ లు, ఎక్జిక్యూటివ్ లాంజ్ లు, రైల్ నీర్ ప్లాంట్ లు, ట్రావెల్ అండ్ టూర్ ప్యాకేజీలు కూడా సాత్విక్ సర్టిఫికెట్ (satvik certificate)పొందుతాయని సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Indian Railways: దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై ప్రకటించిన కేంద్ర మంత్రి..!!
అంటే రైల్వేలతో పాటు దాని అనుబంధ రంగాల్లో కూడా వెజిటీరియన్ భోజనాలను మనం త్వరలో చూడబోతున్నామన్న మాట. అలాగే ఈ శాఖాహార వంటశాలలపై హ్యాండ్ బుక్ ను కూడా విడుదల చేస్తామని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై కొంత మంది రైల్వే ప్రయాణికులు తమ ఆనందం తెలుపుతున్నారు.