నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఏ ముహూర్తాన్న నియమితులయ్యారో.. ఆయనను ఏపీ ప్రభుత్వం ఏ ముహూర్తాన్న తొలగించే చర్యలకు ఉపక్రమించిందో తెలియదు కానీ… నాటి నుంచి ప్రతీ రోజూ క్లైమాక్స్ లా నడుస్తోంది ఈ వ్యవహారం! హైకోర్టు, సుప్రీంకోర్టు ల అనంతరం తాజాగా హైకోర్టు తాజా తీర్పుతో ప్రస్తుతం నిమ్మగడ్డ ఫైల్.. గవర్నర్ చేతిలోకి చేరింది. ఈ సమయలో ఇక నిమ్మగడ్డ నియామకం లాంచనమే అన్న కథనాలు వస్తోన్న తరుణంలో… ఒక షాక్ తగిలింది!
మాములుగా అయితే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికీ – ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మధ్య ఇష్యూ! దీనిలో కోర్టులను ఆశ్రయించడం.. తీర్పులపై పైకోర్టులకు వెళ్లడం మాత్రమే జరిగేది. కానీ.. దీన్ని రాజకీయ సమస్య, ప్రజా సమస్యగా చేసే క్రమంలో టీడీపీ నేతలు దీన్ని తమ ప్రిస్టేజ్ సమస్యగా భావించేశారు! వారి సంగతి అలా ఉంటే… తానేమన్నా తక్కువ తిన్నాన్నా అన్నట్లుగా… రాజకీయ నాయకులతో రహస్య భేటీల పర్వానికి తెరలేపారు నిమ్మగడ్డ. దీంతో.. ఇంతకాలం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నవారు సైతం.. నిమ్మగడ్డ వ్యవహారశైలిపై నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు!
ఈ క్రమంలో ఇప్పటికే ఈ అంశం సుప్రీం కోర్టులో ఉన్నా కూడా… మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు నిమ్మగడ్డ. వెళ్లి గవర్నర్ ని కలవమని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో మరో మారు నిమ్మగడ్డకు షాకిచ్చింది ప్రభుత్వం… “ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం పై పిటీషన్ దాఖలు చేసామని, అది అమలులో ఉండగానే హైకోర్టులో దిక్కారణ పిటీషన్ వేసారని.. దీనిపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే తమ పిటీషన్ నిరర్ధకం అవుతుందని అంటూ.. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది ఏపీ సర్కార్! అవన్నీ ఒకెత్తు అయితే… గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ కు రాజ్ భవన్ నుంచి షాక్ తగిలిందని అంటున్నారు!
ఇక అంతా అయిపోయింది… ఇక ఎస్.ఇ.సి. కుర్చీ ఎక్కేసి.. నచ్చిన వారిని ఉంచుకుని, నచ్చని వారిని తొలగించేలా.. అది కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ స్థానే కొత్త వారిని నియమించుకునేలా.. స్కెచ్ వేసుకున్న నిమ్మగడ్డాకు… తన మౌనంతో సమాధానం చెప్పారంట గవర్నర్!! నిమ్మగడ్డ విషయంలో విన్నంతా విని… మౌనంగానే “బాయ్” చెప్పారని తెలుస్తోంది!! దీంతో… నిమ్మగడ్డకు ఇది భారీ షాక్ అని అంటున్నారు విశ్లేషకులు!! ఆ సంగతి ఒకెత్తు అయితే… గవర్నర్ తో భేటీ అనంతరం బయటకొచ్చిన నిమ్మగడ్డ… గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పడం కొసమెరుపు!!