సైరా లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ ని నిర్మిస్తున్నట్టు తాజా సమాచారం. కరోనా ప్రభావం తగ్గాక ఈ సెట్ లో మెగాస్టార్ పాల్గొనే కీలక సన్నివేశాలని చిత్రీకరించబోతున్నారట.
ఇక రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని ఆయన పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు కొత్త మేకోవర్ తో ను కనిపించనున్నారు. ఈ కొత్త మేకోవర్ లో దాదాపు 25 ఏళ్ళ వయసు తక్కువగా అంటే చాలా యంగ్ గా కనిపించేలా ప్రయత్నిస్తున్నారట.
ఇక ఈ సినిమాలో చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. మణిశర్మ సంగీతమందిస్తుండగా ఇప్పటికే చిరంజీవి, రెజీనాల మీద ఒక స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తుండగా 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.