ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఈ నెలలో కంప్లీటవబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ జరుగుతోందని సమాచారం. కాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వం లో రూపొందబోతున్న ఆదిపురుష్ లో నటించాల్సి ఉంది. ఈ సినిమాని 3-డీ లో టీ-సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి నిర్మించనున్నారు.
దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించబోతున్నాడు. అలాగే లంకేష్ గా సైఫ్ అలీఖాన్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు పాత్రలకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో థీం కొత్తగా ఉండబోతుందని రామాయణం లో ఉన్న కీలక ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని ఊహించని విధంగా చూపించబోతున్నాడని సమాచారం.
కాగా ‘ఆదిపురుష్’ ప్రభాస్ కెరీర్లో 22వ సినిమాగా రూపొందబోతోంది. ఇక ఈ సినిమాని 2021 లో చిత్రీకరణ ప్రారంభించి 2022లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించి.. తమిళం – మలయాళం – కన్నడ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోకి డబ్ చేయనున్నారట. అయితే నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా నటించే సీత పాత్ర ని రివీల్ చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ పాత్ర కి కృతి సనన్ .. కియారా అద్వానీ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.