శర్వానంద్ లేటెస్ట్ సినిమా శ్రీకారం రీసెంట్ గా షూటింగ్ కంప్లీటయింది. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన భలేగుంది బాలా అన్న సాంగ్ ట్రెండింగ్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో పాపులారిటీ ని సాధించిన సిద్దార్థ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. అదితీ రావు హైదరీ, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
కాగా శర్వానంద్ మరో సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా శర్వా కెరీర్ లో 30 వ సినిమా కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రియదర్శి ..వెన్నల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా చాలాకాలం తర్వాత అక్కినేని అమల ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నాగార్జున నటించిన చినబాబు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అమల ఆ తర్వాత ఘర్షణ, శివ, రాజా విక్రమార్క, నిర్ణయం, రక్త తిలకం, ఆగ్రహం లాంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక నాగార్జున ని పెళి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరమయ్యారు. కాగా అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన మనం సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో మదర్ క్యారెక్టర్ చేశారు. అయితే ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ నాగార్జున కి అంతగా నచ్చలేదన్న టాక్ వినిపించింది.
అందుకు కారణం ఈ సినిమాలో అమల క్యాన్సర్ తో పారాడే పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలో నటించలేదు. మళ్ళీ ఇప్పుడు శర్వానంద్ కి తల్లిగా నటంచబోతున్నారు. అయితే ఈ సినిమాలో శర్వా తల్లి గా నటించడం నాగార్జున కి బాగా ఎగ్జైటింగ్ గా అనిపించిందని అంటున్నారు. ఇలాంటి పాత్రల్లో అమల ని చూడటం నాగ్ కి చాలా ఇష్టమని చెప్పినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇకపై కూడా అమల మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్దమే అని తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?