టాలీవుడ్ లో నాలుగో సినిమా చేస్తున్న ఇంకా ఇలదొక్కుకోని హీరోలలో అఖిల్ అక్కినేని కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. ఒక్కో సినిమాలో కాస్తో కూస్తో మెరుగవుతూ వస్తున్నాడు గాని హిట్ మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. అయితే ఈ సారి మాత్రం హిట్ గ్యారెంటీ అని అంటున్నారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా చేస్తున్నాడు.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో ఈ సినిమా నుంచి ఒక పోస్టర్, ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. అంతే మళ్ళీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ లోపు లాక్ డౌన్ వచ్చి పడంది. అయితే ఈ సినిమా మీద కాస్త ప్రేక్షకుల్లో బజ్ క్రియోటయి ఉండటంతో దాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్టుండి చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి క్వారంటైన్ పోస్టర్ అంటూ అఖిల్ పూజా హెగ్డెల రొమాంటిక్ పోస్టర్ ని రిలీజ్ చేసి అభిమానులకి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఇంత వరకు బాగానే ఉంది. కాని ఈ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుకు కారణం హీరోయిన్ పూజా హెగ్డే తన కాలి వేళ్ళతో అఖిల్ చెవిని తాకినట్టు పోస్టర్ ఉండటమే. ఇందులో ఉన్న రొమాంటిక్ యాంగిల్ కంటే కూడా ఫ్యాన్స్ హర్ట్ అవడమే ఎక్కువగా అనిపిస్తుందని ..ఇకపై ఇలాంటి పోస్టర్స్ వద్దంటూ అక్కినేని ఫ్యాన్స్ సలహాలిస్తున్నారట. ఏదేమైనా పబ్లిసిటీ మాత్రం బాగానే అవుతోంది. ఇక ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.