ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అల వైకుంఠపురములో సక్సస్ ని కంటిన్యూ చేస్తూ ఏకంగా పాన్ ఇండియా సినిమానే మొదలు పెట్టాడు అల్లు అర్జున్. కాని ఆ సినిమా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పుష్ఫ అన్న టైటిల్ ని రివీల్ చేస్తూ చిత్ర బృందం 5 భాషల్లో వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద విపరీతమైన బజ్ క్రియోటయింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉంది.
అయితే ఈ సినిమా తర్వాత కూడా మరో స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఇప్పటికే ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఆ దర్శకుడే కొరటాల శివ. ఇప్పటి వరకు కొరటాల ప్రభాస్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు లతో బ్లాక్ బస్టర్స్ తీశాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య ని తెరకెక్కిస్తున్నాడు. కొరటాల.. ఆచార్య, అల్లు అర్జున్.. పుష్ప కంప్లీటవగానే కొరటాల – అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు.
అయితే వాస్తవంగా ఈ సినిమా తర్వాత దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ ఐకాన్ చేయాల్సిన కమిట్మెంట్ కూడా ఉంది. వకీల్ సాబ్ ని తెరకెక్కిస్తున్న వేణు శ్రీరాం ఈ సినిమాని తెరకెక్కిస్తాడని ప్రచారం జరుగుతుంది. మరి పుష్ప తర్వాత ఈ ఇద్దరిలో ఏ దర్శకుడితో ముందు సినిమా చేస్తాడన్నది మాత్రం క్లారిటీ లేదు. దీంతో ఇద్దరు దర్శకులు కన్ఫ్యూజన్ లో పడినట్టు తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ పుష్ప తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ముందు ఏ దర్శకుడితో సెట్స్ మీదకి వస్తాడో చూడాలి.