స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఎంతో నమ్మకంతో పెద్ద ప్రయోగం చేస్తే అది వికటించింది. దాంతో చాలా నెలలు ఏ సినిమా కమిటవ్వాలో అర్థం కాక డైలమాలో పడ్డాడు. అప్పటికే కమిటయిన ఐకాన్ ని పక్కన పెట్టాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందాల్సి ఉండగా నాపేరు సూర్య రిజల్ట్ తో మళ్ళీ ప్రయోగం వద్దనుకున్నాడు అల్లు అర్జున్.
అందుకే త్రివిక్రమ్ తో అల వైకుంఠపురంలో అంటూ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాతైనా ఐకాన్ ట్రాక్ లోకి వస్తుందనుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు. కాని సైలెంట్ గా సుకుమార్ తో పుష్ప అన్న పాన్ ఇండియా సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ తన 21వ సినిమాని సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించాడు. దీనితో ఐకాన్ సినిమా నుండి అల్లు అర్జున్ తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కాని ఈ కథ మీద నిర్మాత దిల్ రాజు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం. అందుకే అల్లు అర్జున్ కాదంటే రామ్ చరణ్ తో ఐకాన్ సినిమాని నిర్మించాలని దిల్ రాజు అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న చరణ్ ఇంకా తన కొత్త ప్రాజెక్ట్ ఏంటో ప్రకటించలేదు.
అందుకే చరణ్ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇస్తే వేణు శ్రీరామ్ దర్శకత్వంలోనే ఐకాన్ ని రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నాడట దిల్ రాజు. ఒకవేళ చరణ్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే నాని తో చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో నాని – దిల్ రాజు – వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ఎం.సి.ఎ వచ్చిన సంగతి తెలిసిందే.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!