పూరి జగన్నాధ్ ఒక హీరోయిన్ ని తెలుగు తెరమీదకి తీసుకు వస్తున్నాడంటే టాలీవుడ్ లో యంగ్ హీరోలతో పాటు మేకర్స్ కూడా అందరూ ఆ హీరోయిన్ గురించే ఆలోచిస్తుంటారు. డేట్స్ కోసం వెంటపడతారు. అంతగా పూరి హీరోయిన్స్ కి డిమాండ్ ఉంటుంది. ఎలా పట్టుకుంటాడో తెలీదు గాని ఒక్కో అమ్మాయి సూపర్బ్ అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో పూరి పరిచయం చేస్తున్న కొత్త హీరోయిన్ గురించే అందరూ వాకాబు చేస్తున్నారట.
బాలీవుడ్ లో ఇప్పటికే మంచి ఫేం అండ్ క్రేజ్ ని సంపాదించుకుంది అనన్య పాండే. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోయిన్. అంతేకాదు చాలామంది యంగ్ హీరోలు తనతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే అనన్య బాలీవుడ్ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాలు హిట్స్ గా నిలిచాయి. ‘
ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది అనన్య. టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమా పై చాలానే ఆశలే పెట్టుకుంది. అంతేకాదు ఎలాగైనా టాలీవుడ్ లో వరసగా అవకాశాలు అందుకునేందుకు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో జనాలని ఆకట్టుకునే పనిలో ఉంది. ఇప్పటికే బోలెడంత మంది ఫాలోవర్స్ ని పెంచుకుంది. అంతేకాదు అదే పనిగా టాలీవుడ్ హీరోలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందట.
పూరి సినిమా గనక హిట్ అయితే వరసగా యంగ్ హీరోల సినిమాలు ఛాన్స్ వస్తుందన్న టాక్ కూడా ఉంది. ఇప్పటికే కొంతమంది మేకర్స్ అనన్య ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తండ్రి పాపులారిటీని ఇమేజ్ ని ఏమాత్రం వాడుకోకుండానే సొంతగా అవకాశాలు సాధించుకుంటుంది.