క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆ మధ్య రంగ మార్తాండ అన్న సినిమాని ప్రకటించాడు. రమ్యకృష్ణ, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా మరో ముఖ్యమైన పాత్ర లో హాస్యనటుడు బ్రహ్మానందం కనిపించబోతున్నారు. అలాగే వెండితెర మీద అద్భుతమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ ని పెంచుకుంటున్న అనసూయ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ‘రంగస్థలం’ సినిమాతో వచ్చిన పాపులారిటీ మళ్ళీ రంగ మార్తాండ తో రానుందని అంటున్నారు.
ఇక అనసూయ కి ఫేవరెట్ దర్శకుడు కృష్ణవంశీ. కాబట్టి ఈ ఆఫర్ ని ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించిందట. ఇక ఈ సినిమాలో అనసూయ పాత్ర నెగిటివ్ రోల్ అని సమాచారం. జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ పాత్రలో అనసూయ నటిస్తోందని.. ఆమె క్యారెక్టర్ అప్పటి దేవదాసి పాత్ర తరహాలో ఉంటుందని తెలుస్తుంది. ఒరిజినల్ వెర్షన్ నట సామ్రాట్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను రంగ మార్తాండ లో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.
20 సంవత్సరాల తరువాత కృష్ణవంశీ తన సతీమణి రమ్యకృష్ణ ని డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. ఇక ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. గోవిందుడు అందరి వాడేలే, నక్షత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. దాంతో ఈసారి రంగ మార్తాండ తో భారీ సక్సస్ ని అందుకొని మళ్ళీ ఫాం లోకి రావాలని చుస్తున్నారు ఈ క్రియోటివ్ డైరెక్టర్. ఇక అనసూయ కి నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇంతకముందు అడవి శేష్ హీరోగా నటించిన క్షణం సినిమాలో అనసూయ నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించింది. కాబట్టి రంగ మార్తాండ లో ఖచ్చితంగా తన పాత్రతో మెప్పిస్తుందన్న నమ్మకాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు.