నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో ఒకేసారి ఇటు తెలుగు అటు మళయాళం చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది అనుపమ పరమేశ్వరణ్. ఆ తర్వతా నితిన్ సమంత నటించిన అ..ఆ సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమాతో భారీ సక్సస్ ని అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందని భావించింది అనుపమ. అంతేకాదు ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లోనే మరో సినిమా చేసింది. కాని ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. అదే హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమా తర్వాత కూడా వరసగా సినిమాలు చేసింది.
తేజ్ ఐ లవ్ యు, కృష్ణార్జున యుద్దం, ఉన్నది ఒకటే జిందగీ ..ఇలా టాలీవుడ్ యంగ్ హీరోలు రాం, సాయి ధరం తేజ్, నేచురల్ స్టార్ నాని లతో నటించింది. అందం అభినయం ఉన్నా కూడా ఎందుకనో అనుపమ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలబడలేకపోతుంది. ఇందుకు ఒక కారణంగా తను కంప్లీట్ ట్రెడిషనల్ వేర్స్ …ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకోవడమే. కాస్తో కూస్తో ట్రెండ్ కి తగ్గట్టు గ్లామర్ రోల్స్ చేస్తే టాలీవుడ్ లో సెటిలయ్యో ఛాన్స్ ఉంటుందేమో. కాని ఆ రూట్ లో అనుపమ వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే ఇలా వరస ఫ్లాపుల్లో ఉన్న అనుపమకి బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రీమేక్ సినిమా రాక్షసుడు తో మాత్రం ఒక హిట్ అందుకుంది.
అయినా మళ్ళీ ఒక్క తెలుగు సినిమాలో అవకాశం రాలేదు. మధ్యలో ఒక సినిమాకి సహాయ దర్శకురాలిగాను పనిచేసింది. మరీ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుందా లేదా ఇది మానేసి దర్శకత్వం వైపు వెళుతుందా తెలీదు గాని సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా ఉంటోంది. అనుపమ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 7 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. నిరంతరం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూ తన అప్డేట్స్ ని అక్కడ ఇస్తుంది. సినిమాలు లేకపోయినా అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటూనే ఉంది. చెప్పాలంటే ఇదొక వ్యాపకంలా అయిపోయింది అనుపమకి. ప్రస్తుతం అనుపమ చేతిలో ఒక తమిళ సినిమా మాత్రమే ఉంది.