యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” . డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై దర్శక ధీరుడు రాజమౌళి రిలీజ్ చేసిన టీజర్ ఊహించని రీతిలో సంచలనం సృష్ఠిస్తోంది.
దర్శక ధీరుడి విజువలైజేషన్ తో పాటు తారక్ పర్ఫార్మెన్స్ కి కేవలం నందమూరి అభిమానులే కాదు ప్రేక్షలుందరు..అలాగే అన్ని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మాయాజాలంలో మునిగిపోయారు. ప్రతీ ఒక్కరు రాజమౌళి, తారక్, చరణ్ ల ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇంతకముందు చరణ్ పోషిస్తున్న రామరాజు టీజర్ కి ఎలాంటి హైప్ క్రియోటయిందో అంతకు మించి ఇప్పుడు తారక్ పోషిస్తున్న భీమ్ టీజర్ కి క్రియోటయింది.
అయితే ఈ టీజర్ లో తారక్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి ఫ్యాన్స్ చాలా పవర్ ఫుల్ డైలాగులు ఆపాదిస్తున్నారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ – త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత లోని డైలాగ్ ని ఈ టీజర్ కి బాగా ఆపాదిస్తున్నారు. ఈ డైలాగ్ త్ర్విక్రం రాశాడు. నవీన్ చంద్రతో తారక్ మాట్లాడుతూ ” నల్లగుడిని నల్లమబ్బు కమ్మినట్టు కమ్మేస్తా ‘ అని పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ ఇప్పుడు అందరూ భీమ్ టీజర్ కి ఆపాదిస్తున్నారు. మొత్తానికి ఆ సినిమాలో త్రివిక్రం రాసిన ఈ డైలాగ్ ఆర్ ఆర్ ఆర్ కోసమే అన్నట్టు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట.