ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆ తర్వాత నుంచి రెండవ సినిమా కొసం చేయని ప్రయత్నాలు లేవు. ఎట్టకేలకి ‘మహా సముద్రం’ సినిమాని ట్రాక్ లోకి తీసుకు రాబోతున్నాడు. ముందు ఈ సినిమాలో రవితేజ హీరో అనుకున్నాడు… రవితేజ నో చెప్పాక నాగచైతన్య అన్నారు.
కాని నాగ చైతన్య కూడా తప్పుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్ తో తీయబోతున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్దార్థ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడని సమాచారం.ఇక ఈ సినిమాలో శర్వానంద్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మజిలీ సినిమాలో చైతుకు జోడిగా ఫస్టాఫ్ లో నటించి మెప్పించిన ‘దివ్యాంశ కౌశిక్’కి ఆ తర్వాత టాలీవుడ్ నుంచి మళ్ళీ ఒక్క ఆఫర్ కూడా రాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సినిమాలో అవకాశం వచ్చిందని తెలుస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా ఈ సినిమాలో అదితి రావు హైదరి నటిస్తోందట.ఇక ఈ సినిమా కంప్లీట్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం అన్న సినిమా చేస్తున్నాడు.
దాదాపు ఈ సినిమా చిత్రీకరణ కప్లీట్ కావచ్చిందని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేస్తారని అందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకారం కంప్లీట్ చేసి అజయ్ భూపతి సినిమాలో జాయిన్ అవుతాడట శర్వానంద్. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం తెరకెక్కించనున్నాడు అజయ్ భూపతి.
అంతేకాదు ఇంతకాలం ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో ఇమేజ్ ఉన్న శర్వానంద్ ని ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట లో ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నటన పరంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయినా శర్వానంద్ అద్భుతంగా చేస్తాడు. అయితే ఆ పాత్రలో శర్వానంద్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోందట.